Posts

Latest Post

అసదుద్ధీన్, అక్భరుద్ధీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారు ? ... బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

Image
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలు నష్ట పోతారని భారతీయజనతా పార్టీ రాష్ట్ర నాయకులు , ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని , మళ్ళీ 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలను కూడా కలిపితే , బీసీలకు న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి జరుగుతుందాని , అసదుద్దీన్ , అక్భరుద్ధీన్ , షబ్బీర్ అలీలు బీసీలు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు కూడా బీసీల జాబితాలో వున్నాయని , బీసీ వర్గాల వాస్తవ గణాంకాలను తక్కువ చేసి , ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన తన పర్యటలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ బీసీల రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి , రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తుందని దువ్వ బట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా దాదాపు 55   శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని ...

మోదీ పాలన దేశానికి ప్రమాదకరం ... తమ్మినేని వీరభద్రం

Image
మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేనివీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో జరిగిన పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్ షాప్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీయని , మోదీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశార విమర్శించారు. ముఖ్యంగా రైల్వే , రక్షణ , విద్య , వైద్య , బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని అన్నారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారని ద్వజ మెత్తారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని , ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై బీజేపీ దాడి చేస్తుందని , కొన్ని రాష్ట్రాల్లో పౌరసత్వం నిరూపించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని , దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందని , అధికారంలోకి వస్తే మనవాద సిద్ధాంతాలు అమలు చేస్తారన్నారు. వారి సిద్ధాంతం ప్రకారం , దేశంలో ఇతర మతాలను రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలపై ఐక్...

ఖమ్మం కార్పోరేషన్ విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ... మంత్రి తుమ్మల

Image
ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ,   విలీన గ్రాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , సహకార , చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శనివారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. 3 వ డివిజన్లో రూ. 50 లక్షలతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు , రూ. 50 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు , ఈనాడు బైపాస్ రోడ్డు నుంచి బల్లెపల్లి వరకు కోటి 80 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు , బల్లేపల్లి ఎస్సీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు , డ్రైన్ల నిర్మాణ పనులకు తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ విలీన గ్రామాల్లో అంతర్గత ససీసీ రోడ్ల నిర్మాణం , డ్రైయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి ఇప్పటి వరకు 200 కోట్లరూపాయల విలువ గల పనులు మంజూరు చేశామన్నారు. మరో రూ. 150 కోట్లు మేరకు ప్రతిపాదనలు పంపామని , ఆగస...

సుప్రీం కోర్టు కీలక తీర్పు ... ఇక ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ అప్పుడే

Image
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో నియోజక వర్గాల పునర్విభజన కోరుతూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టి వేసింది. జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి , కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన తన పిటిషన్లో , ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజక వర్గాల పెంపుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌లో పునర్విభజన జరిగినప్పుడు , ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని , ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు , వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం , రాజ్యాంగంలోని అధికరణ 170 (3) ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 కి పరిమితి ఉందని స్పష్టం చేసింది. 2026 తర్వాత జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే డీలిమిటేషన్ (నియోజక వర్గాల పునర్విభజన) నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి వ్యాజ్యాలను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజక వర్గ...

మున్నేరులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

Image
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని చిన్న మండవ వద్ద మున్నేరు లో చిక్కుకున్న ఐదుగురు గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. గురువారం ఉదయం వరద ఉధృతి లేక పోవడంతో చిన్న మండవ గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య , మొండితోక పుల్లయ్య , గుండ్ల వెంకటేశ్వర్లు , దరెల్లి శ్రీను , కుక్కల గోపి గేదెలు మేపడానికి లంకలోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరద ఉధృతి పెరగడంతో భయంతో రాలేక లంకలోనే వున్నారు. సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్ అనుదీప్ , అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. 25 మంది సభ్యుల ఎన్డిఆర్ఎఫ్ బృందం , మున్నేరులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. సహాయక చర్యల్లో వైరా ఏసీపీ రహమాన్ , చింతకాని మండల తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఈ సందర్భంగా కలె...

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

Image
ఖమ్మం జిల్లాలోని చిన్నమండవ ( చింతకాని మండలం ) వద్ద మున్నేరు లో గురువారం ఐదుగురు చిక్కుకున్నారు. వీరు గేదలను మేపడానికి వెళ్ళి చిక్కుకున్నట్లు చెలుస్తోంది. వారిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు ఆదేశించారు. ఎన్ డి ఆ ర్ఎఫ్ బృందాలను పంపిం , అందర్నీ క్షేమంగా బయటకు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ , పోలీసులకు సూచించారు. అయితే , మున్నేరులో చిక్కుకున్న వారి వివరాలు తెలియాల్సి వుంది. అంతకు ముందు , తుమ్మల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండే జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు ఉన్నతాధికారులతో తుమ్మల మాట్లాడారు. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తుమ్మల ఆదేశించారు. గత ఏడాది వరదల వల్ల వందల మంది నిరాశ్రయులయ్యారని , మళ్లీ అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే , తప్పకుండా పునర...

ఖమ్మంలో కొలువు దీరనున్న కలియుగ దైవం ... తుమ్మల చొరవతో ఆలయ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం

Image
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మంలో  కొలువుదీర బోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మానానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆలయంతో పాటు పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించేందుకు ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవతో టీటీడీ అధికార ప్రతినిధి బృంధం ఇందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన టీ.టీ.డీ ఎస్.ఈ జగదీశ్వర్ రెడ్డి , ఇ .ఇ సురేందర్ నాథ రెడ్డి , ఢీ.ఇ.ఇ నాగభూషణం , ఎలక్ట్రికల్ ఈ.ఈ రవి శంకర్ రెడ్డి , ఏ ఈ జగన్మోహన్ రావులతో కూడిన అధికార బృంధం అల్లీపురం , రఘునాధ పాలెం ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికార బృంధం మంత్రి తుమ్మలను కలిసి ఆలయం , కళ్యాణ మండపాలకు సంబంధించిన నమూనాలను చూపించారు. నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తుమ్మల నాగేశ్వర రావు , టీ.టీ.డీ చైర్మన్ బీ.అర్.నాయుడుకు చేసిన ఆలయ నిర్మాణం ప్రతిపాదనలకు  స్పందించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.