అసదుద్ధీన్, అక్భరుద్ధీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారు ? ... బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలు నష్ట పోతారని భారతీయజనతా పార్టీ రాష్ట్ర నాయకులు , ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని , మళ్ళీ 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలను కూడా కలిపితే , బీసీలకు న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి జరుగుతుందాని , అసదుద్దీన్ , అక్భరుద్ధీన్ , షబ్బీర్ అలీలు బీసీలు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు కూడా బీసీల జాబితాలో వున్నాయని , బీసీ వర్గాల వాస్తవ గణాంకాలను తక్కువ చేసి , ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన తన పర్యటలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ బీసీల రిజర్వేషన్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి , రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తుందని దువ్వ బట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా దాదాపు 55 శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని ...